మిస్టర్ మజ్ను ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్ !

యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ విడుదలకు సిద్దమైంది. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈచిత్రంలో అఖిల్ ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్లోని జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నారు. అదే ఈవెంట్లో ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను 8:30 గంటలకు విడుదలచేయనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈచిత్రం జనవరి 25న విడుదలకానుంది.

ఇక ‘అఖిల్ ,హలో’ చిత్రాలతో అక్కినేని అభిమానులను మెప్పించలేకపోయిన అఖిల్ ఈ చిత్రం వారి అంచనాలను అందుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు.

Exit mobile version