సాయి తేజ్ నెక్స్ట్ నుంచి మెగా మాస్ అనౌన్సమెంట్ కి టైం ఫిక్స్

సాయి తేజ్ నెక్స్ట్ నుంచి మెగా మాస్ అనౌన్సమెంట్ కి టైం ఫిక్స్

Published on Dec 8, 2024 5:00 PM IST

మెగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాలు “బ్రో” అలాగే “విరూపాక్ష” వరుస హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు తర్వాత తాను ఓ భారీ చిత్రాన్ని తన కెరీర్ 18వ ప్రాజెక్ట్ గా యువ దర్శకుడు రోహిత్ నుంచి అనౌన్స్ చేసాడు. హను మాన్ మేకర్స్ తో అనౌన్సమెంట్ నుంచే మంచి బజ్ నెలకొనగా ఇపుడు ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే సాలిడ్ ట్రీట్ గా గ్లింప్స్ ని ఈ డిసెంబర్ 12న ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో ఓ మెగా మాస్ అనౌన్సమెంట్ అంటూ ఇపుడు మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. రేపు డిసెంబర్ 9న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి అందిస్తునట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా టీజర్ గ్లింప్స్ లాంఛ్ కి గ్లోబల్ స్టార్ రాంక్ చరణ్ రాబోతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి ఇది అందుకోసమేనా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు