ధనుష్, శింబు జంట తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ను కలిగి ఉన్నారు. ఈ తమిళ హీరోలపై తనకు విపరీతమైన క్రష్ ఉందని టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తాజాగా సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో లైవ్ చాట్ సందర్భంగా ప్రియాంక ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. మీ కోలీవుడ్ క్రష్ ఎవరు అని ప్రియాంకను ఒక అభిమాని అడిగినప్పుడు, నటి ఇలా సమాధానమిచ్చింది.
ఎప్పటినుండో ధనుష్ మరియు కొన్ని కారణాల వల్ల శింబును కూడా ఇష్టపడటం ప్రారంభించిన విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇద్దరూ క్యూట్ పీప్స్ అంటూ చెప్పుకొచ్చింది. త్వరలో కోలీవుడ్ సినిమాల్లోకి రావాలని తమిళ అభిమానులు ఈ నటిని కోరారు. వర్క్ ఫ్రంట్లో, ధనుష్ ప్రస్తుతం సర్ అనే ద్విభాషా ప్రాజెక్ట్ను చేస్తుండగా, శింబు రెండు ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రియాంక చివరిగా గమనం చిత్రంలో కనిపించింది.