కోలీవుడ్ లోకి అడుగు పెడుతున్న టాలీవుడ్ యంగ్ బ్యూటీ!

కోలీవుడ్ లోకి అడుగు పెడుతున్న టాలీవుడ్ యంగ్ బ్యూటీ!

Published on Jul 26, 2022 8:00 PM IST


కలర్ ఫోటో సినిమాతో చాందిని చౌదరి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలే కాకుండా వెబ్ షోలు కూడా చేస్తోంది ఈ నటి. ఆమె ఇటీవల ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సమ్మతమేలో కిరణ్ అబ్బవరంతో కలిసి నటించడం జరిగింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే, ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే, ఈ నటి అశోక్ సెల్వన్ తదుపరి చిత్రంలో నటించనుంది. ఈ చిత్రం తో ఈ టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇదే విషయాన్ని నటి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధృవీకరించింది. చాందినితో పాటు మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్ కూడా ఇతర కథానాయికలుగా నటిస్తున్నారు. కమల్ హాసన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సిఎస్ కార్తికేయ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పేరు పెట్టని ఈ చిత్రం కథానాయకుడి జీవితంలోని వివిధ దశల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు