‘వర్షం’ రీ రిలీజ్ పై త్రిష సూపర్ పోస్ట్

‘వర్షం’ రీ రిలీజ్ పై త్రిష సూపర్ పోస్ట్

Published on Nov 13, 2022 12:57 AM IST

రెండు రోజుల క్రితం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, త్రిష ల ఒకప్పటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం పలు థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. శోభన్ తెరకెక్కించిన ఈ మూవీని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. కాగా ఈ మూవీని పలు థియేటర్స్ లో రీ రిలీజ్ చేయగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మూవీ చూస్తూ థియేటర్స్ లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతున్న ఒక వీడియో క్లిప్ ని తన ఇన్స్టాగ్రమ్ లో నేడు పోస్ట్ చేసారు హీరోయిన్ త్రిష.

ప్రభాస్ తో చేసిన వర్షం రిలీజ్ అయి 18 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా లేటెస్ట్ గా థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన అనంతరం ప్రస్తుతం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న ఈ హ్యాపీ మూమెంట్స్ చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని, తెలుగులో తన తొలి సినిమాగా రిలీజ్ అయిన వర్షం ఎప్పటికీ అద్భుతమైన మెమొరీగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని త్రిష పెట్టిన వీడియో పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/Ck2xdYKvPHW/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు