వైరల్ పిక్ : ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్ లో మెగాస్టార్ తో బాలీవుడ్ బ్యూటీ

వైరల్ పిక్ : ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్ లో మెగాస్టార్ తో బాలీవుడ్ బ్యూటీ

Published on Nov 12, 2022 6:12 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మితం అవుతుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇక మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్ ఆ అంచనాలు మరింతగా పెంచేసింది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న బాలీవుడ్ యువ నటి ఊర్వశి రౌటేలా, సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి దిగిన ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ తో కలిసి వర్క్ చేస్తుండడం హ్యాపీగా ఉందని, అలానే వాల్తేరు వీరయ్య టీమ్ కి తన తరపున అభినందనలు తెలియచేస్తూ ఊర్వశి పోస్ట్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ 2023 సంక్రాంతికి ప్రేక్షకల ముందుకి రానున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు