డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “ఊర్వశివో రాక్షసివో”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “ఊర్వశివో రాక్షసివో”

Published on Dec 2, 2022 1:05 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో వసూళ్ళను సాధించలేదు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. తెలుగు ఓటిటి ప్లాట్‌ఫారమ్ ఆహా వీడియో ఈ చిత్రాన్ని డిసెంబర్ 9, 2022న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించింది.

థియేటర్‌లలో సినిమాను చూడలేకపోయిన వారు వచ్చే శుక్రవారం నుండి ఆహాలో చూడవచ్చు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌లో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, శంకర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు