వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమా షూటింగ్ ను కొంతకాలం క్రితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ టీజర్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానుందని సమాచారం. ఇందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక గా విడుదల చేయడం జరిగింది.
ఈ చిత్రంలో రొమాంటిక్ మరియు లక్ష్య ఫేమ్ ఢిల్లీ ఇన్స్టాగ్రామ్ బ్యూటీ కేతికా శర్మ కథానాయికగా నటించింది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ దర్శకుడు గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.