ఇళయ దళపతి విజయ్ జోసెప్ హీరోగా రశ్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ అయితే తెలుగు లో “వారసుడు” గా ప్లాన్ చేస్తుండగా దీనిపై ఇప్పుడు మరిన్ని అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంపై అయితే లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రం ఆడియో హక్కులు అయితే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో దిగ్గజ సంస్థ అయినటువంటి టి సిరీస్ వారు సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనితో అయితే ఈ సినిమా తెలుగు తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు అయితే భారీ బడ్జెట్ తో సినిమా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా విడుదల చేయబోతున్నారు.
T-Series joins hand with Sri Venkateswara Creations as Bhushan Kumar acquires music rights of Thalapathy Vijay’s upcoming movie “Varisu”
The film is directed by Vamshi Paidipally and music by Thaman.S, the film stars Thalapathy Vijay and Rashmika Mandanna#Thalapathy pic.twitter.com/m8EyH97eQj— T-Series (@TSeries) October 29, 2022