“వరిసు” ఆడియో హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ..!

“వరిసు” ఆడియో హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ..!

Published on Oct 29, 2022 11:01 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెప్ హీరోగా రశ్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ అయితే తెలుగు లో “వారసుడు” గా ప్లాన్ చేస్తుండగా దీనిపై ఇప్పుడు మరిన్ని అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంపై అయితే లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ చిత్రం ఆడియో హక్కులు అయితే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో దిగ్గజ సంస్థ అయినటువంటి టి సిరీస్ వారు సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనితో అయితే ఈ సినిమా తెలుగు తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు అయితే భారీ బడ్జెట్ తో సినిమా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా విడుదల చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు