“వరిసు”..జస్ట్ పోస్టర్స్ తోనే స్టోరీ అంచనా వేసేయ్యోచ్చా.?

“వరిసు”..జస్ట్ పోస్టర్స్ తోనే స్టోరీ అంచనా వేసేయ్యోచ్చా.?

Published on Oct 28, 2022 7:59 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాని మేకర్స్ తెలుగులో “వారసుడు” పేరిట గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రం రిలీజ్ కి అయితే ఇంకా టైం ఉండగా మేకర్స్ అయితే ఆల్రెడీ ప్రమోషన్స్ ని మీడియాలో తమిళ్ నుంచి స్టార్ట్ చేశారు.

అలా లేటెస్ట్ గా వంశీ ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి మరిన్ని పోస్టర్ లు అన్ అఫీషియల్ గా వరిసు నుంచి బయటకి వచ్చాయి. దీనితో అక్కడ నుంచి ఈ సినిమా స్టోరీ పై పలు ఆసక్తికర రచ్చే స్టార్ట్ అయ్యింది. వరిసు అలాగే వంశీ లాస్ట్ వర్క్ మహర్షి లో కొన్ని సీన్స్ ని పోలుస్తూ కొందరు సినిమా పై అయితే కామెంట్స్ చేస్తున్నారు.

చిన్న లాజిక్ చూసినట్టు అయితే సినిమా టైటిల్ వారసుడు, మహర్షి సినిమా స్టోరీకి అసలు ఎక్కడైనా లింక్ ఉన్నట్టు అనిపిస్తుందా? అలాంటిది రెండు సినిమాలు పోల్చడం అనేది సెన్స్ లెస్ అనే చెప్పాలి. ఇది పూర్తిగా కొత్త స్టోరీనే కాగా ఆ పోస్టర్స్ కేవలం యాదృచ్చికం మాత్రమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు