“వరిసు” నాన్ తెలుగు రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్.!

“వరిసు” నాన్ తెలుగు రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్.!

Published on Nov 1, 2022 9:04 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని తెలుగులో వారసుడు పేరిట రిలీజ్ చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి అయితే విజయ్ కెరీర్ లోనే సెన్సేషనల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ చిత్రాన్ని తెలుగు బిజినెస్ మినహా రికార్డు బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. తమిళ సినీ వర్గాలు చెబుతున్న వారు చెబుతున్న దాని ప్రకారం అయితే తెలుగు మినహా హిందీ, తమిళ్, డిజిటల్, ఆడియో హక్కులు కలిపి 250 కోట్లకి పైగా బిజినెస్ ని చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే తెలుగు వరకు ఓన్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే వరిసు చిత్రం తో విజయ్ మరో భారీ రికార్డు సెట్ చేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు