యూట్యూబ్ లో అదరగొడుతున్న “వారిసు” పాటలు.!

యూట్యూబ్ లో అదరగొడుతున్న “వారిసు” పాటలు.!

Published on Dec 11, 2022 5:41 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశి పైడిపల్లి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం పై అయితే భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాకి థమన్ అందించిన ఆల్బమ్ లో ఆల్రెడీ రెండు పాటలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి.

మరి యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ కొల్లగొట్టిన ఈ సాంగ్స్ ఇప్పుడు రెండు కూడా కొత్త మర్క్స్ అందుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన థీ థలపతి సాంగ్ లేటెస్ట్ గా 20 మిలియన్ మార్క్ ని క్రాస్ చెయ్యగా నెక్స్ట్ అయితే రంజితమే సాంగ్ ఏకంగా 90 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది.

దీనితో అయితే ఈ రెండు పాటలు కూడా యూట్యూబ్ లో మాత్రం అదిరే రెస్పాన్స్ తో కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అనేకమంది స్టార్స్ నటిస్తూ ఉండగా దిల్ రాజు అయితే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు