డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన నాగ శౌర్య “వరుడు కావలెను”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన నాగ శౌర్య “వరుడు కావలెను”

Published on Dec 28, 2021 5:34 PM IST


నాగ చైతన్య, రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించడం జరిగింది. విశాల్ చంద్రశేఖర్ తో పాటుగా ఈ చిత్రం కోసం థమన్ సంగీతం అందించడం విశేషం. నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీ 5 వేదిక గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. జనవరి 7 వ తేదీన వస్తుండగా, ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా జీ 5 తెలుగు విడుదల చేయడం జరిగింది. థియేటర్ల లో ఆకట్టుకున్న ఈ చిత్రం జీ 5 లో ఏ తరహాలో ఆకట్టుకుంటుందొ చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు