అక్టోబర్ 29 న విడుదల కానున్న “వరుడు కావలెను”

అక్టోబర్ 29 న విడుదల కానున్న “వరుడు కావలెను”

Published on Oct 15, 2021 5:50 PM IST

నాగ శౌర్య, రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం తో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. ఈ చిత్రం ను అక్టోబర్ 29 వ తేదీన థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఈ చిత్రం నుంచి విడుదల అయిన కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా, అలాగే దిగు దిగు నాగ, మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది.

ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో వరుడు కావలెను చిత్రం మిమ్మల్ని అలరించటానికి మీ ముందుకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 29 న విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు