పవన్ కోసం పిఠాపురంలో ప్రచారం చేయనున్న వరుణ్ తేజ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పార్టీ తరపున విరివిగా ప్రచారం నిర్వహిస్తూ పలు సభలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, బిజెపి తో కలిసి కూటమిలో చేరిన జనసేన మొత్తంగా 2024లో ఏపీలో 21 చోట్ల పోటీచేయనుండగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్యెల్యేగా పోటీచేయనున్నారు. ఇక ఆయన కోసం ఇప్పటికే జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, గబ్బర్ సింగ్ గ్యాంగ్ వంటి వారు పిఠాపురంలో ప్రచారం చేసారు.

అలానే మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రచారం నిర్వహించగా రేపు ఆయన కుమారుడు వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గం. లకు ప్రచారం ప్రారంభించి వన్నెపూడి మీదుగా అనంతరం కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారు. ఆ ప్రచారంలో భాగంగా ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో పాల్గొననున్న వరుణ్ తేజ్, వాటిలో ప్రసంగించనున్నట్లు జనసేన తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో తెలిపారు.

Exit mobile version