వైరల్ : నిన్న మ్యాచ్ లో “వీరసింహా రెడ్డి” హవా.!

వైరల్ : నిన్న మ్యాచ్ లో “వీరసింహా రెడ్డి” హవా.!

Published on Nov 3, 2022 10:00 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా నడుస్తూ ఉండగా ఈ సినిమాపై కూడా అంతకంతకు మంచి అంచనాలు అయితే సెట్టవుతున్నాయి. ఇక ఈ చిత్రం క్రేజ్ అయితే నిన్న జరిగినటువంటి టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో కనిపించడం వైరల్ గా మారింది.

నిన్న ఆస్ట్రేలియా లో ఇండియా వర్సెస్ బంగ్లా మ్యాచ్ మంచి ఉత్కంఠభరితంగా జరగగా ఇందులో బాలయ్య మరియు కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ వీరసింహా రెడ్డి పోస్టర్స్ తో హంగామా చేశారు. దీనితో ఈ విజువల్స్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వరకు కూడా రాగా తాను ఆ పిక్ షేర్ చేసి మంచి ఎగ్జైట్మెంట్ ని వ్యక్తం చేశారు. దీనితో ఈ మాస్ పోస్టర్ మంచి వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు