వైరల్ : థమన్ పై ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్ గోపీచంద్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

వైరల్ : థమన్ పై ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్ గోపీచంద్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Jan 1, 2023 12:12 AM IST


నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్ర చేయగా ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే వీరసింహారెడ్డి నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని భారీ స్థాయిలో మూవీ పై అంచనాలు ఏర్పరిచాయి.

అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ బీజీఎమ్ వర్క్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి నేడు చూసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని కొద్దిసేపటి క్రితం తన అనుభవాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసారు. ఇప్పుడే వీరసింహారెడ్డి ఫస్ట్ హాఫ్ చూసాను, బీజీఎమ్ అయితే మా బావ థమన్ కుమ్మేసాడు అంతే అంటూ గోపీచంద్ మలినేని పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంద్. కాగా అంతకముందు బావలు సయ్యా, ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ నా వర్క్ అంటూ థమన్ పెట్టిన పోస్ట్ కి రిప్లై గా గోపీచంద్ ఈ పోస్ట్ పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు