కృష్ణ గారి మరణం పట్ల “వీరసింహా రెడ్డి” యూనిట్ సంతాపం.!

కృష్ణ గారి మరణం పట్ల “వీరసింహా రెడ్డి” యూనిట్ సంతాపం.!

Published on Nov 15, 2022 4:04 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో “వీరసింహా రెడ్డి” అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉదయం నాడు తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో భారతదేశ సినిమా అంతా ఒక్కసారిగా నివ్వెరపోయింది. దీనితో అనేక మంది ప్రముఖులు కృష్ణ గారి మరణం పట్ల తీవ్ర విషాదం వ్యక్తం చేయగా హీరో బాలయ్య కూడా ఈ ఉదయమే తన భావోద్వేగ స్పందనను కూడా పంచుకున్నారు.

ఇక తాను ఇప్పుడు నటిస్తున్న వీరసింహా రెడ్డి చిత్ర యూనిట్ అంతటితో కలిసి అయితే వారి సినిమా సెట్స్ నుంచే శ్రీ కృష్ణ గారి చిత్రపటానికి పూల మాలలు అన్నీ వేసి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు. మరి ఈ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ సహా నటీనటులు ఇతర టెక్నీషియన్స్ అంతా కృష్ణ గారి పటానికి పుష్పాలు సమర్పించి నివాళులు ఘటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు