భారీ ధరకు అమ్ముడైన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి యుఎస్ఏ రైట్స్

భారీ ధరకు అమ్ముడైన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి యుఎస్ఏ రైట్స్

Published on Oct 30, 2022 3:00 AM IST


ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ తో యువ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ మూవీ వీరసింహా రెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ కమర్షియల్ మూవీ వాల్తేరు వీరయ్య. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

కాగా 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ రెండు సినిమాల యొక్క యుఎస్ఏ హక్కులని ప్రముఖ సంస్థ శ్లోక సినిమాస్ వారు దక్కించుకున్నారు. కాగా వాల్తేరు వీరయ్య రూ. 6 కోట్లకు, అలానే వీర సింహా రెడ్డి రూ. 3.80 కోట్లకు వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరి సినిమాల మధ్య నెక్స్ట్ సంక్రాంతికి భారీ బాక్సాఫీస్ పోరు జరుగనుంది. మరి ఇందులో ఎవరి సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరొక రెండు నెలలు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు