‘లైగర్’ ఇష్యూ పై విజయ్ దేవరకొండ స్టేట్మెంట్

‘లైగర్’ ఇష్యూ పై విజయ్ దేవరకొండ స్టేట్మెంట్

Published on Nov 30, 2022 11:51 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటించిన మూవీ లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఇటీవల రిలీజ్ తరువాత బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత మూవీ నష్టాల విషయమై నిర్మాత దర్శకుడైన పూరి జగన్నాథ్ కి అలానే కొందరు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య కొద్దిపాటి వివాదం తలెత్తడం జరిగింది.

అనంతరం ఈ సినిమా పెట్టుబడుల కేసు విషయమై మొన్న పూరి జగన్నాథ్, ఛార్మి లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరై పలు వివరాలు తెలిపారు. ఇక నేడు ఇదే ఇష్యూ పై హీరో విజయ్ దేవరకొండని కొన్ని గంటల పాటు ఈడీ సభ్యులు ప్రశ్నించి వివరాలు అడిగారు. కాగా విచారణ ఆనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ, పాపులారిటీ తో పాటు ఇటువంటి సమస్యలు వస్తుంటాయని, అయితే తనకు ఎల్లప్పుడూ అభిమానుల ప్రేమ తోడుగా ఉంటుందని తెలిపారు. ఈడీ అధికారులు తమ విధినిర్వహణలో భాగముగానే తనని ప్రశ్నించారని, త్వరలోనే అన్ని సమసిపోతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు విజయ్ దేవరకొండ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు