టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కబోతున్న చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ కార్యక్రమంలో సమంత, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణలు హాజర్ కాలేదు. దీంతో పలు మీడియా సంస్థలు సమంత ఎందుకు ఈ కార్యక్రమానికి హాజర్ కాలేదన్న కథనాలను ప్రచురించాయి.
ఈ వార్తలపై విజయ్ దేవరకొండ ఫన్నీగా స్పందిస్తూ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఓ ఫోటోలో సమంత, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణల ఫోటోలను ఫోటోషాప్ ద్వారా వెనకాల నిల్చున్నట్టు పెట్టేసి ఇదే ఒరిజినల్ ఫోటో అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ యొక్క ఎడిటింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయ్ షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లే కాకుండా సమంత మరియు వెన్నెల కిషోర్ కూడా ఫన్నీగా స్పందించారు.
ఇదిలా ఉంటే మొన్నటి వరకు షూటింగ్లతో బిజీగా గడిపిన సమంత ప్రస్తుతం దుబాయ్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఆమె ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు తెలుస్తుంది.
???????????? https://t.co/YYmqUb4xtL
— Samantha (@Samanthaprabhu2) April 21, 2022