ఇలయతలపతి విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వరిసు. తెలుగులో ఈ మూవీ వారసుడు పేరుతో తెరకెక్కుతోంది. 2023 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కార్తీక్ పళని ఫోటోగ్రఫి అందిస్తున్న వరిసు నుండి ఇప్పటికే రంజితమే అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్, విజయ్ ఫ్యాన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఈ ప్రోమోలో విజయ్ స్టెప్స్ తో పాటు తమన్ అందించిన ట్యూన్ కూడా ఆకట్టుకుంది. ఇక విజయ్ స్వయంగా పాడిన రంజితమే ఫుల్ సాంగ్ ని రేపు సాయంత్రం 5 గం. 30 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అనౌన్స్ చేసారు. విజయ్ నటించిన లేటెస్ట్ మూవీస్ లోని పలు సూపర్ హిట్స్ సాంగ్స్ తో కూడిన ఒక మ్యాషప్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్, ఈ రంజితమే సాంగ్ కూడా ఆ ప్లే లిస్ట్ లో చేరుతుందని చెప్తున్నారు. మరి రంజితమే ఫుల్ సాంగ్ రిలీజ్ తరువాత ఎంత మేర రెస్పాన్స్ అందుకుటుందో చూడాలి.
The next song to join this playlist arrives Tomorrow nanba ❤️#RanjithameFromTomorrow 5:30 PM#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #Ranjithame #Varisu #VarisuPongal pic.twitter.com/APIBRsWuRf
— Sri Venkateswara Creations (@SVC_official) November 4, 2022