కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న మూవీ వరిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ పై తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కి థమన్ సంగీతం అందిస్తుండగా కార్తీక్ పళని కెమెరా మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు.
అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి మొదటగా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ రంజితమే విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ క్రేజీ మాస్ సాంగ్ నేటితో సక్సెస్ఫుల్ గా కోటి వ్యూస్ ని సొంతం చేసుకోవడంతో యూనిట్ కొద్దిసేపటి క్రితం ఆనందం వ్యక్తం చేస్తూ ఒక వీడియో బైట్ రిలీజ్ చేసింది. దీనితో వరిసు మూవీ పై అందరిలో అంచనాలు మరింత పెరిగాయి. కాగా వరిసు మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
#Ranjithame crosses 100M+ views now ❤️
Humongous love everywhere ????????️ https://t.co/Q56reRvcvc
???? https://t.co/gYr0tlcMmD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani #Varisu #VarisuPongal #RanjithameHits100M pic.twitter.com/TVvguolq7X— Sri Venkateswara Creations (@SVC_official) December 19, 2022