ధృవ్ లాంచ్ కోసం బాలాను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరించిన విక్రమ్ !


తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతూ నటిస్తున్న చిత్రం ‘వర్మ’. తెలుగు సూపర్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం. ప్రముఖ దర్శకుడు బాల ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ విడుదల నిన్న జరిగింది. ఈ ఈవెంట్ లో విక్రమ్ పాల్గొన్నాడు.

ఈ సందర్బంగా విక్రమ్ మాట్లాడుతూ చాలా కాలం క్రితం బాలను నేను అడిగాను నా కొడుకును తప్పకుండ నువ్వే లాంచ్ చేయాలనీ ఎందుకంటె బాల ఒక రాయి తో కూడా యాక్టింగ్ చేయంచగలడు అంతటి సమర్ధుడు అందుకే ధృవ్ ను లాంచ్ చేయమని అడిగాను అని అయన అన్నారు. ఈ4 ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో బెంగాలీ నటి మేఘ చౌదరి కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ తెలుగు నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రలో కనిపించనుంది. రధాన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

ఇక ఈసినిమా టీజర్ ఫై తెలుగు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మాతృకను చెడగొట్టేలాఉందని విమర్శలు కురిపిస్తున్నారు. ఈచిత్రం తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.

Exit mobile version