‘విరాట పర్వం` రెండో ఘట్టానికి కూడా.. !

‘విరాట పర్వం` రెండో ఘట్టానికి కూడా.. !

Published on Jul 12, 2019 1:01 AM IST

‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్లుగా పెట్టి ‘విరాట పర్వం` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. కాగా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. వచ్చే వారం నుండి రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తోందట చిత్రబృందం.

మొదటి షెడ్యూల్ ను తెలంగాణలోని ధరిపల్లి గ్రామంలో షూట్ చేసిన చిత్రబృందం రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే తీయనుందట. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. కాగా ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటిస్తోంది. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు