ఓటీటీలోకి “విరాటపర్వం”.. ఎప్పటినుంచంటే?

ఓటీటీలోకి “విరాటపర్వం”.. ఎప్పటినుంచంటే?

Published on Jun 17, 2022 11:33 PM IST

దగ్గుబాటి రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “విరాటపర్వం”. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై అప్పుడే ప్రచారం మొదలయ్యింది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుందని, ఈ మూవీ సాధారణంగా ఓటీటీలో విడుదలైనట్లు నాలుగు వారాల తర్వాత రిలీజ్ కావడం లేదట. ఇలాంటి మంచి సినిమాను థియేటర్‌లో చూసే ఫీల్‌ మిస్‌ అవుతారని అందుకే ఇప్పట్లో ఓటీటీలో విడుదల చేయట్లేదట మేకర్స్. కానీ ఈ మూవీని జూలై మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం వినబడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు