ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్-ఆర్య “ఎనిమి”..!

ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్-ఆర్య “ఎనిమి”..!

Published on Jan 25, 2022 11:00 PM IST

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం “ఎనిమీ”. మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో మృణాళిని రవి కథానాయిక కాగా, మమత మోహన్ దాస్, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. దీపావళి సందర్భంగా గత ఏడాది నవంబర్ 4న తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమయ్యింది. “ఎనిమీ” ఓటీటీ హక్కులను సోనీలివ్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే త్వరలోనే స్ట్రీమింగ్ తేదినీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు