వైరల్ అవుతోన్న హీరో విశాల్ కామెంట్స్!

వైరల్ అవుతోన్న హీరో విశాల్ కామెంట్స్!

Published on Dec 21, 2022 1:00 PM IST

కోలీవుడ్ నటుడు విశాల్ కి తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడ సూపర్ హిట్ ను సాధించాయి. అయితే విశాల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాఠీ. ఈ చిత్రం తెలుగు లో కూడా డిసెంబర్ 22, 2022 న విడుదల కాబోతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం విడుదల సందర్భం గా హీరో విశాల్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ను ప్రమోట్ చేస్తున్నారు. అయితే సినిమాల విషయానికి వస్తే తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని, యూనిక్ స్టైల్ పవన్ సొంతం అని అన్నారు. థియేటర్ల లో అతని సినిమాలు చూశా అని, పండుగ లా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా రాజకీయాల గురించి వస్తే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టమని తెలిపారు. ఓటేసే అవకాశం వస్తే ఇక్కడ తన ఓటు జగన్ కి వేస్తా అని తెలిపారు విశాల్. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఏ. వినొత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న లాఠీ చిత్రం లో సునైన, ప్రభు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నంద దురైరాజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు