రాజమౌళి దగ్గర నుండి ఆ జబ్బు విశాల్ కి అంటుకుంది – విజయేంద్ర ప్రసాద్

రాజమౌళి దగ్గర నుండి ఆ జబ్బు విశాల్ కి అంటుకుంది – విజయేంద్ర ప్రసాద్

Published on Nov 14, 2022 12:00 PM IST

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్ పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు.

హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు. విశాల్ ఈవెంట్ లో పోలీస్ డ్రెస్ వేసుకొని బైక్ పై వేదిక వద్దకు రావడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు. హీరో విశాల్ మాట్లాడుతూ.. విజయేంద్రప్రసాద్ గారిని ఎప్పటి నుండో కలవాలని నా కోరిక. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. డిసెంబర్ 22న లాఠీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకుడు ఏ వినోద్ కుమార్ గురించి సినిమా విడుదలైన తర్వాత సిల్వర్ స్క్రీన్ నే చెబుతుంది. సినిమా నిర్మాతలు రమణ, నంద నా స్నేహితులు. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. యువన్ శంకర్ రాజా నాకు చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చారు. లాఠీ కి బ్రిలియంట్ స్కోర్ చేసారు. డాక్టర్ పవన్ సినిమాని తెలుగులో పంపిణీ చేస్తున్నారు. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ అమేజింగ్ వర్క్ ఇచ్చారు’ అని తెలిపారు.

రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. విశాల్ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను(నవ్వుతూ). విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది(నవ్వుతూ). మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను’ అని కోరుకున్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. విశాల్ గారి సినిమాలు పదిహేనేళ్ళుగా తెలుగులో వస్తున్నాయి. పందెంకోడి, పొగరు సినిమాలు ఇరగబడి చూసే వాళ్ళం. చాలా మంది అమ్మాయిలు విశాల్ గారికి ఫ్యాన్స్ గా వుండేవారు. వాళ్ళ అభిమానం చూస్తే జలస్ గా వుండేది. ఒక ప్రేమికుడిగా కనిపిస్తూ భారీ ఫైట్లు కూడా చేసే స్క్రీన్ ప్రజన్స్ చాలా తక్కువ మందికి వుంటుంది. అది ప్రభాస్ గారిలో కనిపిస్తుంది. అలా అరుదుగా వుండే హీరోల్లో విశాల్ గారు ఒకరు. ‘లాఠీ’ని థియేటర్ లో చూడటానికి ఎదురుచూస్తున్నాను.” అన్నారు.

నిర్మాత రమణ మాట్లాడుతూ.. విశాల్ లాంటి హీరో మా తొలి సినిమా చేయడం ఆనందంగా వుంది. మా ముగ్గురి జర్నీ 17 ఏళ్ళు. ముగ్గురం కలసి చాలా సేవా కార్యక్రమాలు చేశాం. లాక్ డౌన్ లో ‘లాఠీ’ కథ విన్నాం. చాలా నచ్చింది. విశాల్ కి బాగుంటుందని అనుకున్నాం. కాస్త భయపడుతూనే విశాల్ కి పంపించాం. విశాల్ కి నచ్చింది. అయితే మీరే నిర్మించాలని చెప్పడం మాకు సర్ ప్రైజ్ అనిపించింది. అప్పుడు మా దగ్గర రెండు లక్షలు మాత్రమే వున్నాయి. కానీ అంతా ఒక మ్యాజిక్ లా జరిగింది. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ లాంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు ప్రాజెక్ట్ లో చేరారు. సినిమా సైజ్ పెరుగుతూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారింది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. విశాల్ కి ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ వస్తుందనే నమ్మకం వుంది. అంత అద్భుతంగా చేశారు. ” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు