యాక్షన్ హీరో విశాల్ హీరోగా, కొత్త దర్శకుడు తు.ప.శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సామాన్యుడు’. ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్లైన్. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై విశాల్ నిర్మించాడు. అయితే కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం తాజాగా కొత్త రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసుకుంది.
తెలుగు మరియు తమిళ భాషలలో ఫిబ్రవరి 4న ‘సామాన్యుడు’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ని క్రియేట్ చేశాయి. డింపుల్ హయాతి ఈ సినిమాలో కథానాయికగా నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.