విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్

విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్

Published on Nov 26, 2022 6:02 PM IST

విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ డ్రామా మూవీ మట్టి కుస్తీ. తమిళ్ లో గట్టా కుస్తీ పేరుతో తెరకెక్కిన ఈ మూవీని రవితేజ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థల పై రవితేజ, విష్ణు విశాల్ భారీ వ్యయంతో నిర్మించారు. చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా రిచర్డ్ ఎమ్ నాథన్ ఫోటోగ్రఫి అందించారు. అయితే మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్, సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి.

కాగా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తుండగా దీనికి మాస్ మహారాజ రవితేజ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపింది. అజయ్, శత్రు, శ్రీజ రవి, మునీష్ కాంత్, కాళీ వెంకట్ తదితరులు కీలక పాత్రలు చేసిన మట్టి కుస్తీ మూవీ డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు