రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విష్ణు విశాల్ స్పోర్ట్స్ డ్రామా “మట్టి కుస్తి”

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విష్ణు విశాల్ స్పోర్ట్స్ డ్రామా “మట్టి కుస్తి”

Published on Nov 11, 2022 12:59 PM IST

విష్ణు విశాల్ హీరోగా విష్ణు విశాల్ స్టూడియోస్ మరియు RT టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి నటుడు స్వయంగా నిర్మిస్తున్న చిత్రం మట్టి కుస్తీ. ఎఫ్‌ఐఆర్ తర్వాత రవితేజతో విష్ణు విశాల్‌కి ఇది రెండో బ్యాక్ టు బ్యాక్ అసోసియేషన్. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక గా నటిస్తుంది.

మేకర్స్ ప్రకటించిన ప్రకారం, మట్టి కుస్తీ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్‌లో ఐశ్వర్య కుర్చీపై కూర్చుని ఉండగా, విష్ణు విశాల్ ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. ఫస్ట్ మరియు సెకండ్ లుక్ పోస్టర్స్ ద్వారా మేకర్స్ సినిమాలోని యాక్షన్ మరియు రొమాంటిక్ యాంగిల్ ను చూపించారు. ఇప్పుడు విడుదల తేదీ పోస్టర్ సినిమాలో స్త్రీ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో విష్ణు విశాల్ రెజ్లర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు చెల్లా అయ్యావు, నిర్మాతలు రవితేజ, విష్ణు విశాల్, బ్యానర్లు RT టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్, DOP రిచర్డ్ M నాథన్, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ ప్రసన్న జికె, ఆర్ట్ డైరెక్టర్ ఉమేష్ జే కుమార్, సాహిత్యం వివేక్, PRO వంశీ, శేఖర్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు