మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రస్తుతం రూపొందుతోన్న ప్రతిష్టాత్మక మూవీ వాల్తేరు వీరయ్య. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్, మోషన్ పోస్టర్, అలానే ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి.
అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి మాస్ మహారాజ రవితేజ ఏసిపి విక్రమ్ సాగర్ పాత్రలో నటిస్తుండగా దానికి సంబందించిన టీజర్ ని నేడు ఉదయం రిలీజ్ చేసారు మేకర్స్. రవితేజ మార్క్ పవర్ఫుల్ స్టైల్, యాక్షన్, ఫైట్స్, డైలాగ్స్ తో అదరగొట్టిన ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. కాగా తప్పకుండా వాల్తేరు వీరయ్య 2023, జనవరి 13న రిలీజ్ తరువాత మెగాఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుని పెద్ద విజయం అందుకోవడం ఖాయం అంటోంది యూనిట్.
A MASS FORCE to reckon with ????
Mass Maharaja @RaviTeja_offl's teaser from #WaltairVeerayya trending #1 on YouTube with 2M+ views ????
– https://t.co/DJU6adONHaMegastar @KChiruTweets @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/RfOZ4HfWbJ
— Mythri Movie Makers (@MythriOfficial) December 12, 2022