అఫీషయల్ : మెలోడియస్ గా మెస్మరైజ్ చేస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సాంగ్

అఫీషయల్ : మెలోడియస్ గా మెస్మరైజ్ చేస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సాంగ్

Published on Dec 19, 2022 5:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి తో యువ దర్శకుడు బాబీ తీస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య నుండి ఇటీవల రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచింది.

ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ నుండి శ్రీదేవి చిరంజీవి అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. జాస్ ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ అద్భుతంగా పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ ని కూడా దేవిశ్రీప్రసాద్ అందించడం విశేషం. ముఖ్యంగా ఈ సాంగ్ యువతతో పాటు మాస్ ఆడియన్స్ సైతం ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి స్పందనతో కొనసాగుతోంది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు