బాలయ్యతో కాదు, సాయి ధరమ్ తేజ్ తో ప్లాన్ చేస్తున్నాడట !

బాలయ్యతో కాదు, సాయి ధరమ్ తేజ్ తో ప్లాన్ చేస్తున్నాడట !

Published on Apr 25, 2022 11:20 PM IST

డైరెక్టర్ సంపత్ నంది, సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ కి, సంపత్ నంది ఓ కథ చెప్పాడని, సాయి ధరమ్ తేజ్ కి కూడా ఆ కథ బాగా నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే నిర్మాత సి.కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు.

డైరెక్టర్ ‘సంపత్ నంది’ను సాయి ధరమ్ తేజ్ దగ్గరకు పంపింది సి.కళ్యాణే అని టాక్ నడుస్తోంది. మరి సాయి ధరమ్ తేజ్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య సంపత్ నంది బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, సాయి తేజ్ అయితేనే తన సినిమా త్వరగా సెట్స్ పైకి వెళ్తుందని సంపత్ నంది ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు