యాత్ర విడుదల వాయిదాపడిందా ?


దివంగత నేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర తో తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రం డిసెంబర్ 21న విడుదలవుతుందని ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చిత్ర వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదల వాయిదా పడిందట. అదే రోజున ‘పడిపడి లేచె మనసు , అంతరిక్షం’ కన్నడ డబ్బింగ్ ‘కెజిఎఫ్’ చిత్రాలు విడుదలవుతుండంతో యాత్రను వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నాడు. 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version