భరత్, విషికా లక్ష్మణ్లు హీరో హీరోయిన్లుగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు బాగానే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ను విడుదల చేయగా.. అది బాగానే ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి హృదయాన్ని కదిలించే పాటను రిలీజ్ చేశారు.
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులు మీదుగా రిలీజ్ చేసిన ఈ ‘తలిచే తలిచే’ పాటను సింగర్ సునీత ఆలపించగా.. రమావత్ శ్రీకృష్ణ సాహిత్యం అందించారు. పెద్దపల్లి రోహిత్ అందించిన బాణీ అయితే హృదయాన్ని కదిలించేలా ఉంది. తండ్రి మీదున్న ప్రేమను కూతురు పాడే ఈ పాట ఇప్పుడు సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. పాటను రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘సాంగ్ చూశాను. కంటెంట్ ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది. కొత్త టాలెంట్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. మంచి కంటెంట్ను జనాలు ఆదరిస్తున్నారు. ఈ యంగ్ అండ్ న్యూ టీంకు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.