ట్రెండింగ్ : కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలో కన్నడ స్పీచ్ తో అదరగొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

ట్రెండింగ్ : కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలో కన్నడ స్పీచ్ తో అదరగొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

Published on Nov 2, 2022 12:55 AM IST


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు బెంగళూరులో జరిగిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా ఈ వేడుకల్లో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక రాజరత్న పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని గారికి సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఎన్టీఆర్ అందించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రం గర్వించదగ్గ గొప్పనటులు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు అని, అలానే ఆయన కుటుంబం నుండి వచ్చిన శివన్న, దివంగత పునీత్ రాజ్ కుమార్ ఇద్దరూ కూడా నటులుగా ఎంతో గొప్ప పేరు అందుకుని రాజ్ కుమార్ గారి పేరుని మరింతగా పెంచారన్నారు. ఇక నేడు పునీత్ కి కర్ణాటక రాజరత్న అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన ఒక అద్భుత నటుడు, గొప్ప తండ్రి, గొప్ప కొడుకు, గొప్ప భర్త అలానే వీటన్నిటికీ మించి మంచి మనసున్న గొప్ప వ్యక్తి అని ఆయనని కొనియాడారు. ఇక ఎన్టీఆర్ తన స్పీచ్ మొత్తం కూడా కన్నడ లో మాట్లాడడం విశేషం. మొత్తంగా ఎన్టీఆర్ స్పీచ్ మాట్లాడుతున్నంత సేపు స్టేడియం లోని ఆడియన్స్ నుండి విపరీతంగా హర్షద్వానాలు మారుమ్రోగాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ స్పీచ్ తాలూకు ఫోటోలు, వీడియోలు విపరీతంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు