కాశీలో సందీప్ కిషన్ ‘టైగర్’ చిత్రీకరణ

Sundeep-Kishan
జయాపజయాలతో సంబంధంలేకుండా వరుసపెట్టి ఆఫర్లను సంపాదించుకుంటూ యువ తారల అగ్రనటుల జాబితాలోకి చేరువవుతున్న నటులలో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ నటించిన ‘బీరువా’ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘టైగర్’ షూటింగ్ లో పాల్గుంటున్నాడు

కాశీలో ఈ సినిమా ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది. రాహుల్ రవిచందర్, సందీప్ ల నడుమ ఈ షూటింగ్ చోటుచేసుకుంటుంది. మురగదాస్ శిష్యుడు ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. రన్ రాజా రన్ ఫేం శీరత్ కపూర్ హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్

Exit mobile version