
కొద్ది రోజుల క్రితం ఉత్తరాంద్రలోని హూద్ హూద్ భాధితుల కోసం టాలీవుడ్ అంత ఏకమై నిధులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో తమిళ్ చిత్ర పరిశ్రమ మొత్తం సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియెసన్ (ఎస్ ఐ సి ఎ ) కుటుంబాలు మరియు పిల్లల కోసం నిధులు సేకరించడానికి సిద్దం అయ్యింది. ఎస్ ఐ సి ఎ 10వ అవార్డ్స్ సెర్మని ని 9 మరియు 10 జనవరి 2015 న కౌలాలంపూర్ లో జరపనున్నారు.
తమిళ్ సినిమా రంగంలోని హేమాహేమిలైన కమల్ హాసన్ భారతి రాజ ఇళయరాజా విజయ్ సురియా విక్రం లతో పాటు ఇతర దక్షిణాది తారలు బాలకృష్ణ మోహన్ లాల్ మమూట్టి పునీత్ రాజ్ కుమార్ మరియు బాలీవుడ్ నుండి ధర్మేంద్ర హాజారు కానున్నారు. నయన తార కాజల్ అగర్వాల్ సమంతా శృతి హాసన్ లాంటి తారలు కూడా హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన మొత్తాన్ని ఎస్ ఐ సి ఎ మెంబెర్స్ పిల్లల చదువుల కోసం మరియు వారి కుటుంబాల కోసం ఖర్చు పెడతారు.