
విజువల్ థ్రిల్లర్ ‘2.0’ నిన్న విడుదలై ప్రేక్షుకులను విశేషంగా అలరిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోషించిన పక్షి రాజా అనే పాత్రకు మంచి స్పందన లభిస్తుంది. నిజ జీవితంలో సలీమ్ అలీ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని శంకర్ ఈ పాత్రను సృష్టించాడు. సలీం అలీ కూడా బర్డ్ లవర్. పక్షుల రక్షణ కోసం ఎంత గానో కృషి చేశారు ఆయన. అందుకే ఆయనకు ఫాదర్ అఫ్ ఇండియన్ బర్డ్స్ అనే బిరుదు లభించింది. 1987లో ఆయన మరిణించారు.
ఇక సలీం అలీ జీవీతాన్ని ఆదర్శంగా తీసుకొని శంకర్ సృష్టించిన పక్షి రాజా పాత్రలో అక్షయ్ పరకాయ ప్రవేశం చేశారు. 2.0 విజయం సాధించడంలో ఈ పాత్ర చాలా కీలకమైంది.