‘ధురంధర్ 2’ చూశాక వారిపై విరుచుకుపడ్డ సందీప్ రెడ్డి వంగా.. పోస్ట్ వైరల్

Dhurandhar 2 Sandeep reddy

లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషనల్ సినిమా ధురంధర్ 2 కోసం అందరికీ తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మ్యాడ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే లేటెస్ట్ గా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరియు ప్రభాస్ లు కలిసి అల్లు సినిమాస్ లో ధురంధర్ 2 చూడడం జరిగింది. పిక్స్ కూడా వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా తన రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో సందీప్ తన మార్కు అగ్రెసివ్ మోడ్ లోనే పోస్ట్ చేయడం వైరల్ గా మారి చర్చకు దారి తీసింది. స్ట్రెయిట్ గా ప్రాపగాండా పేరిట కొందరు నటులు, రచయితలు ధురంధర్ 2 లాంటి సినిమాకి డ్యామేజ్ చేయాలని చూసిన వారిపై కౌంటర్ వేస్తూ మొదలు పెట్టారు.

అలాగే రణ్వీర్ సింగ్ కి ఆదిత్య ధర్ కి ఎలాంటి చెడు దృష్టి పడకూడదు అని వ్యాఖ్యానించారు. గత రాత్రి ధురంధర్ 2 చూసాను, ఒక అద్భుతమైన సినిమా అంటూ సందీప్ చేసిన పోస్ట్ ఇప్పుడు మరింత సెన్సేషన్ గా మారింది.

Exit mobile version