కమర్షియల్ పాయింట్స్ ప్రతి ఘటనకి హెల్ప్ అవుతాయా?

prathigatana
సొసైటీలోని ఏదో ఒక సమస్యని తీసుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించే తమ్మారెడ్డి భరద్వాజ్ ఒరిస్సాలో జరిగిన ఓ యదార్థ గాదని ఆధారంగా చేసుకొని చేసిన సినిమా ‘ప్రతి ఘటన’. చార్మీ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో రేష్మ ఓ కీలక పాత్రలో కనిపించింది.

ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకూ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమాలు తీసే భరద్వాజ్ మొదటి సారి కామెడీ, సెటైరికల్ ఎలిమెంట్స్ ని పొందుపరిచారు. అలాగే ఈ కామెడీ ప్రేక్షకులని బాగా నవ్విస్తుందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తమ్మారెడ్డి భరద్వాజ్ మొదటిసారి ట్రై చేసిన కమర్షియల్ ఎలిమెంట్స్ ‘ప్రతి ఘటన’కి హెల్ప్ అవుతాయా? లేదా అనేది? మరికొద్ది సేపట్లో తెలిసిపోతుంది.

Exit mobile version