నట కిరీటి రాజేంద్రప్రసాద్ మాస్టర్ భరత్ తో కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం పేరు ‘సినిమాకెల్దాం రండి’. ఈ చిత్రానికి ఎమ్.జి రెడ్డి దర్శకత్వం వహించగా పి.సునీత మరియు ఎన్. సీత కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తూ రవి బాబు, ఎమ్మెస్ నారాయణ, మాస్టర్ భరత్, రాజీవ్ కనకాల మరియు నాగినీడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చింది. శ్రవణ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.