రజనీ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లను పరిశీలిస్తున్నారు !

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తర్వాతి సినిమాను యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానుంది.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో రజనీ సరసన కథానాయకిగా త్రిష, అంజలి మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెలను పరిశీలిస్తున్నారని, వీరి ముగ్గురిలోనే ఎవరో ఒకర్ని ఎంచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి దర్శక నిర్మాతలు చివరగా ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి.

Exit mobile version