‘సైరా’కు ‘సాహో’ టార్గెట్ అయిందా ?

‘సైరా’కు ‘సాహో’ టార్గెట్ అయిందా ?

Published on Sep 2, 2019 12:00 AM IST

రెండు పెద్ద సినిమాలు కొన్ని రోజుల వ్యధిలో విడుదలైతే ముందుగా ప్రస్తావనకు వచ్చేది రెండిటి వసూళ్ల అంశమే. గత శుక్రవారం ప్రభాస్, సుజీత్ కలిసి చేసిన ‘సాహో’ చిత్రం విడుదలై రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.205 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఏపీ, తెలంగాణాల్లోని అనేక ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ‘సాహో’ పేరిట కొత్త రికార్డ్స్ నమోదవుతున్నాయి. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 42 కోట్ల షేర్, నైజాంలో రెండు రోజుల్లో రూ.14.42 కోట్లు రాబట్టింది. దీంతో ఈ వసూళ్లను అదే స్థాయిలో రిలీజ్ కాబోయే మెగాస్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘సైరా’ బీట్ చేయగలదా అనే డిస్కషన్స్ ఇప్పటి నుండే మొదలయ్యాయి.

మెగా అభిమానులు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’ బాహుబలి స్థాయి ఓపెనింగ్స్ సాధిస్తుందని, క్లొజింగ్ కలెక్షన్లు కూడా రికార్డ్ స్థాయిలో ఉంటాయని, హిందీ పరిశ్రమకు మరొక షాక్ తప్పదని ధీమాగా చెబుతున్నారు. మరి వారి నమ్మకాన్ని అక్టోబర్ 2న విడుదలకానున్న ‘సైరా’ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు