ఆ అందాల నటి సజీవ శిల్పంగా మారితే..!

ఆ అందాల నటి సజీవ శిల్పంగా మారితే..!

Published on Sep 3, 2019 10:47 AM IST


నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్ నందు గల ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న గ్రాండ్ గా శ్రీదేవి విగ్రహాన్ని ఆ మ్యూజియంలో లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా భర్త బోనీ కపూర్ శ్రీదేవి “మా హృదయాలలోనే కాదు, లక్షలాదిగా ఉన్న ఆమె అభిమానుల హృదయాలలో ఆమె బ్రతికే ఉన్నారు. ఈనెల 4న మేడం టుస్సాడ్స్ మ్యూజియం నందు ఏర్పాటు చేయనున్న ఆమె విగ్రహం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్లో శ్రీదేవి విగ్రహానికి మెరుగులు దిద్దుతున్న ఒక చిన్న ప్రోమో వీడియో లాంటిది కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో శ్రీదేవి బంగారు వన్నె వస్త్రాలలో, కిరీటం ధరించి ఉన్నారు. ముఖ్యంగా శ్రీదేవి కళ్ళు చూస్తుంటే ఆమె విగ్రహమా లేక, మనీషా అన్నంత సహజంగా ఉన్నారు. మొత్తంగా శ్రీదేవి మైనపు విగ్రహం నిజంగా దేవకన్యలా, సజీవ శిల్పంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు