తెలుగు సినీ పరిశ్రమ లో కొత్త టాలెంట్ కి ఎప్పుడు అవకాశాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ రోజుల్లో వంటి హిట్ సినిమా తో నిర్మాతగా సినీ పరిశ్రమ కి పరిచయమై ఆ తర్వాత టాక్సీవాలా వంటి హిట్ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఎస్కేఎన్. అయితే జూలై 7 వ తేదీన ఆయన పుట్టిన రోజు, ఈ సందర్భంగా తను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలు, కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అయితే టీవీ9 లో జర్నలిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ లో తన ప్రయాణం మొదలైందని తెలిపారు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలకు పీఆర్వో గా పని చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే అనంతరం మారుతి దర్శకుడిగా పరిచయం అయిన ఈ రోజుల్లో తో నిర్మాతగా ప్రయాణం మొదలైంది అని అన్నారు. అంతేకాక భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు సహా నిర్మాత గా వ్యవహరించినట్లు తెలిపారు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సివాలా తో అగ్ర హీరోలతో సినిమా చేసిన పూర్తి స్థాయి నిర్మాతగా ఓ విజయవంతమైన ముందడుగు వేసినట్లు తెలిపారు. అయితే సాయి ధరమ్ తేజ్ హిట్ మూవీ ప్రతి రోజూ పండగే చిత్రానికి సహ నిర్మాత గా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం హీరో గోపీచంద్, దర్శకులు మారుతి, హీరోయిన్ రాశీఖన్నా కాంబినేషన్ లో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రానికి సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నాను అని అన్నారు.
అయితే దర్శకుడు మారుతి అండ్ టీమ్ డైరెక్ట్ చేస్తున్న ఒక సినిమా కు యూవీ క్రియేషన్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో మారుతి వెల్లడిస్తారు అని అన్నారు. అయితే అదే విధంగా రచయిత, దర్శక నిర్మాత సాయి రాజేష్తో అసోసియేటై మూడు సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. కలర్ఫోటో దర్శకుడు సందీప్రాజ్తో కూడా రెండు సినిమాలు ఉన్నాయి అని అన్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆషాడ మాసం వెళ్లిపోయిన తర్వాత తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, వీఐ ఆనంద్, పలాస ఫేమ్ కరుణ్ కుమార్లతో సినిమాలు ఉన్నాయి అని తెలిపారు. ఇవి కాకుండా ఆహా ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో త్రీ రోజేస్, జీ5, ఓ ఇంటర్నేషనల్ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో ఓ వెబ్సిరీస్ గురించిన చర్చలు తుదిదశలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కొత్త ప్రతిభావంతులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో మారుతిగారు, నేను కలిసి మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ను స్టార్ట్ చేసి, వెబ్ కంటెంట్ను వ్యూయర్స్ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం మూడు సినిమాలు, మూడు వెబ్సిరీస్లు సెట్స్పై ఉన్నాయి అని, ఇన్ని ప్రాజెక్ట్స్ను ఒకేసారి చేయాలని నేను ప్లాన్ చేయలేదు అని, ఏడాది కి మూడు ప్రాజెక్ట్స్ చేయాలని అనుకున్నాను అని, కానీ కరోనా కారణంగా ఇలా జరిగింది అని అన్నారు. ఒకేసారి ఆరు ప్రాజెక్ట్స్ ఉన్నట్లు ఉన్నాయి. సో బిజీగా ఉంటున్నాను అని అన్నారు. ఇది అదృష్టమో, దురదృష్టమో, తెలియడం లేదు అని అన్నారు.
అయితే ఒకరితో అసోసియేట్ అవ్వడం నాకు ఏం ప్రాబ్లమ్ కాదు, క్యాలికులేషన్స్ లో వన్ ప్లస్ వన్ అంటే టు, కానీ భాగస్వామ్యంలో వన్ ప్లస్ వన్ ఈక్వెల్ టు త్రీ అంటారు, అలాగే పెద్ద సినిమాలకు సహ నిర్మాతగా ఉండటం నాకు ఒకే అని అన్నారు. ఒక అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యమని నేను భావిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
నేను, మారుతి, బన్నీవాసుగారు, యూవీవంశీగారు మేం నలుగురం సినిమాల్లోకి రాకముందే మంచి మిత్రులం అంటూ చెప్పుకొచ్చారు. నేను ఈ రోజుల్లో సినిమాతో నిర్మాతనైయ్యాను అని. 100 పర్సెంట్ లవ్ తో వాసు, మిర్చి తో వంశీ నిర్మాతలుగా మారారు అని అన్నారు. అందరం హిట్ సినిమాలతోనే నిర్మాతలుగా ఇండస్ట్రీకి వచ్చాం, మా అందరికీ మంచి సింక్ ఉంటుంది అని తెలిపారు. అందుచేత మా భాగస్వామ్యాల విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ ఉండవు అని అన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మెజారిటీ ఓటింగ్ను బట్టి మాలో ఒకరికి నచ్చపోయిన ముందుకు వెళతాం అని అన్నారు.
లెక్కల కంటే ముందు మేం స్నేహితులం, సో పెద్ద ప్రాబ్లమ్స్ లేవు అని అన్నారు. పైగా నిర్మాత అల్లు అరవింద్ గారి సలహాలు, సూచనలతో ముందుకు వెళుతున్నాం అని, అరవింద్గారు మమ్మల్ని ప్రొత్సహిస్తున్నారు అని అన్నారు.
అయితే మారుతి దర్శకుడిగా పరిచయం అయిన తొలి సినిమాకు నేను నిర్మాతను అని అన్నారు. అయితే ఆయన తొమ్మిది సినిమాలు తీస్తే వాటిలో ఆరు సినిమాలకు నేను నిర్మాతగానో, సహ నిర్మాతగానో ఉన్నాను అని అన్నారు. నా ప్రతి భాగస్వామ్యంలోనూ ఆయన ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు.
సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఏ ఓటీటీ, ఏ ఏటీటీ ఫ్లాట్ఫామ్ కూడా రీ ప్లేస్ చేయలేవు అని అన్నారు. కొన్ని సినిమాలను తెరపైనే చూడాలి, కానీ కరోనా వల్ల కొంతమంది నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని అన్నారు. సో వారి ఓటీటీ ఫ్లాట్ఫామ్స్కు ఈ సమయంలో వెల్లడంలో తప్పులేదెమో అని అన్నారు. కానీ థియేటర్స్ వ్యవస్థ లేకపోతే స్టార్డమ్ తగ్గిపోయింది అని, థియేటర్స్ వ్యవస్థ మనుగడ బాగుండాలి అని అన్నారు. అది థియేటర్స్కు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి కూడా మేలు చేస్తాయని అన్నారు. కొంతమంది నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఓటీటీలకు వెళుతున్నారు అని, దాన్ని తప్పుపట్టలేం అంటూ మద్దతు తెలిపారు. కానీ ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా, నిర్మాతగా నేను థియేటర్స్ బిగ్స్రీన్పై సినిమా చూసేందుకే మొగ్గుచూపుతాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి థియేటర్స్లో సినిమా ప్రదర్శితమై ఆ తర్వాత ఓటీటీకి వస్తేనే బెటర్ అని నా అభిప్రాయం అంటూ సూటిగా తెలిపారు.
లాక్డౌన్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ చేస్తే తెలుగు ప్రేక్షకులు మునపటిలానే వచ్చారు అని వ్యాఖ్యానించారు. స్టార్ హీరో సినిమాలు విడుదలైనప్పటికీని ఏ ఇండస్ట్రీలోనూ ఇలా జరగలేదు అని, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ వస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ గారి వకీల్సాబ్ వస్తే ఎంతటి ఓపెనింగ్ వచ్చాయో మనందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే క్రాక్, జాతిరత్నాలు, ఫస్ట్వేవ్ తర్వాత విడుదలైన తొలి సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెలిసిందే అని అన్నారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించారు అంటూ చెప్పుకొచ్చారు.
అయితే సినిమా మన దైనందిన జీవితంలో ఓ భాగం. మనం ఆఫీకు వెళ్తున్నాం, హోటల్కు వెళ్తున్నాం, అలాగే సినిమాలకు వెళతాం అంటూ చెప్పుకొచ్చారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పెరిగింది అని, ప్రేక్షకుల్లో కూడా కాస్త భయం తగ్గింది అని అన్నారు. సో థర్డ్ వేవ్ లేకపోతే థియేటర్స్ రీ ఓపెన్ అయితే ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారనే అనుకుంటున్నాం అని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే మన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు ఎంతలా పెరుగుతున్నాయో చూస్తునే ఉన్నాం, సినిమా ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది, అలాగే సినిమా టికెట్ ధరలు కూడా పెరుగుతున్నాయి, అయినా టికెట్ ధరలు పెరగడం వల్ల నిర్మాతలకు పెద్దగా లాభం ఉండదు అని అన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని రాయితీలను ఇస్తుంది అని, ఇండస్ట్రీని ఓ పరిశ్రమలా కాకుండా కళగా గుర్తించి ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రొత్సహించాలని కోరుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాల్లో ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కూడా ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలి అని అన్నారు. ఇక సినిమాల విడుదల తేదీలు మన చేతుల్లో లేవు అంటూ చెప్పుకొచ్చారు.