న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మంచి అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ముగిసినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఈ నెల చివరిలో చిత్ర బృందం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. నాని హీరోగా నటించిన చివరి రెండు సినిమాలు “వి”, “టక్ జగదీశ్” ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచాయి. మరీ నానికి కనీసం ‘శ్యామ్ సింగరాయ్’ ద్వారానైనా హిట్ పడుతుందో లేదో చూద్దాం.