కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తదుపరి చిత్రం వరిసులో కనిపించనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తుంది. జనవరి 12, 2023 న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. మేకర్స్ తాజాగా మరొక ఆసక్తికరమైన అప్డేట్ తో ముందుకు వచ్చారు. కెఎస్ చిత్ర గారు పాడిన తల్లి గురించిన ఎమోషనల్ సాంగ్, మూడవ సింగిల్ ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ ట్రాక్కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పాటకు సంబంధించిన గ్లింప్ను కూడా విడుదల చేశారు. జయసుధ, ప్రకాష్ రాజ్, ఖుష్భు, మహేశ్వరి, యోగి బాబు, శరత్కుమార్ తదితరులు ఈ బిగ్గీలో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.